మరచిపోకండిచేతన – మే--1962చరిత్ర పుటలు వెనుకకు తిరగేసి చూసుకుంటే, “పురాతనకాలం దగ్గరనుంచి తెల్లగొడుగులు వుండేవని సదరు తెల్లగొడుగుల చల్లని నీడను కల్ల-కపటం ఎరుగని ప్రజలు చల్లగా బ్రతికేవారని” చెప్పుకోవడానికి బోలెడు దాఖలాలు కనిపిస్తాయి.
అసలు మానవుని గొప్పతనం, తోటి మానవునిచేత గొడుగు పట్టించుకోవడంలోనే గర్భితమై వుందని పూర్వీకుల గట్టి నమ్మకం. ఆ నమ్మకాన్ని గట్టిగా నమ్మే కాబోలు – శ్రీకృష్ణుడంతటివాడు కర్ణునితో “చూస్తావేమయ్యా .... వాయుపుత్రుడి చేత నీకు దివ్యశ్ఛత్రాన్ని పట్టిస్తాను” అని ఆశ చూపించి, “యీ దెబ్బతో కర్ణుడు పాండవులతో చేతులు కలపక తప్పదు” అనుకున్నాడు. అయినా కర్ణుడు గొడుగు పట్టించుకునే వ్యామోహానికి తల ఒగ్గలేదు. కాబట్టి అతనికింత వరకు పేరు ప్రఖ్యాతి దక్కాయి. యీ ఒక్క విషయం చాలు మన పూర్వీకులు గొడుగు పట్టించుకునేందుకు ఎంత ముచ్చటపడేవారో తెలవడానికి.
కాలం అనేక మార్పులు పొందినా , ఆనాటినుంచి , యీనాటివరకూగొడుగు పట్టించుకునే ఉబలాటం , గొప్పవారమనుకునే వారికి వీసమెత్తుకూడా తగ్గలేదు. కాలాన్ని జయించి , నిలబడ్డ కీర్తి ఖాయంగా దీనికే దక్కాలి. మరీ, నేను మొత్తం జనాన్ని, “గొడుగు పట్టించుకునేవారు.. గొడుగు పట్టేవారు” అని రెండు భాగాలు గా విభజించాను.
అయితే కాలగర్భం లో పడి తెల్లగొడుగుల కాలం, చల్లగా తరలి పోయింది. యీనాడు మనకు మిగిలిన వన్నీ నల్లగొడుగులే. యీ లోకంలో కోటానుకోట్ల గుబ్బగొడుగులుండొచ్చును. కాని నాకు వాటితో ప్రసక్తి లేదు. యీ నా గొడవంతా నా ఒక్క గొడుగుకే పరిమితమై ఉంది. అయితే “గొడుగు గురించి యింత గొడవ దేనికి?“ అని అడగొచ్చు. కానీ, నాకూ, నా గొడుగుకు గల అనుబంధం మీరు తెలుసు కుంటే, మీరు తప్పక మీ ప్రశ్నను ఉపసంహరించుకుంటారు.
నా వివాహంలో లాంఛన ప్రాయంగా జరిగిన కాశీ యాత్రా తంతులో మా బావ మరిది ఒక నల్లగొడుగు, జత చెప్పులు నాకు సమర్పించి సముదాయించాడు. తరువాత నా ఉద్యోగాన్వేషణా, భీషణ ప్రయత్నంలో చెప్పులు అరిగి నామరూపరహితమైనా, గొడుగు మాత్రం కొద్ది చిల్లులతోనైనా యీనాటివరకూ నా చేతిలో మిగిలి పోయింది. నా జీవితాన్ని ఆక్రమించుకుంది.
ఆదిలో నా అర్ధాంగిలానే, నా గొడుగూ నా మాట వినిపించుకునేది కాదు. బాహాటంగా ఎదురు తిరిగే శక్తి లేక, యితరుల కాళ్ళలో బడి...వాళ్ళచేత తిట్టించేది. అటు తరువాత అచిరకాలంలోనే, “యిద్దరం కలసి చిరకాలం జీవించడం తప్పనిసరి”. అని తెలుసుకున్న తరువాత .. నా భార్యలాగే... మనసు సరి చేసుకుని నాతో సహకరించడం ప్రారంభించింది లెండి.
వివాహం అనేది ప్రతి జీవి, జీవితంలోనూ, ఒక మధురశృతి...మధురస్మృతి- అట్టి మధురక్షణాలు జీవితఘర్షణలో పడి చెరిగిపోకుండా గుర్తుకు చేడానికంటూ కొన్ని ఙ్ఞాపకాలుండాలి. అలా మా వివాహానికి గుర్తుగా మిగిలినవి ...దాని మెళ్ళో నల్లపూసలు, మంగళ సూత్రం, నా చేతిలో నల్లని గొడుగూ, అందుకనే నాకు ఆ గొడుగంటే అంత మమత ఏర్పడుంటుంది.
ప్రస్తుతం నేను నా గొడుగును, ఎండ, వాన, మొదలైన అల్పవిషయాలకు ఉపయోగించనేలేదు. అది ఉపయోగించదు కూడా. నా గుండెల్లో మండే మంట కన్న కారే కన్నీటికి మిన్నగా నన్ను వర్షం తడిపెయ్యగలదా?.. లేదే...అందుకే నాకు ఎండకూ, వానకూ ఎన్నడూ గొడుగవసరంలేదు. అయితే ఎండకూ వానకూ ఉపయోగించని గొడుగు దేనికి?. అని మీకు అర్ధం కాని ప్రశ్న నా ముఖంమీద మీరు విసురుతారని నాకు తెలుసు. అందుకే మనవి చేసుకుంటున్నాను.
నా అదృష్టం వల్ల ...వారి దురదృష్టం వల్ల నాకు అప్పిచ్చితీరుగ వసూలు చేసుకుందామని. నన్ను పట్టుకుందికి, ఓపిగ్గా తిరుగుతున్న అప్పులవాళ్ళ తీక్షణ, వీక్షణ పంక్తుల నుండీ – ఆదివారం నాడైనా, ఆఫీసు పని అయిన తర్వాత నైనా, రోడ్డుమీద తారస పడితే, నిప్పులు గక్కే అధికార్ల నుంచీ నా తలను తప్పించి, తన గర్భంలో దాచేసుకుని నన్ను కంటికి రెప్పలా కాపాడుతుంది నాగొడుగు. – అంత కన్నా మహోపయోగం – ఏముందీ.
నాకు మనుష్యుల ఎదుట పడడటమంటే తగని భయం. అంతే కాదు – దైవంకన్నా సగటు మనిషంటేనే - భయం, భక్తి కూడా నాకు మిన్న, ఎందుకంటారేమో..
ఒక్కసారైనా దైవానికి నైవేద్యం సమర్పించక పోయినా, నమస్కరించక పోయినా, ఆగ్రహిస్తాడో లేదో ఎవరూ చెప్పలేరు. ఆగ్రహిస్తాడనడానికి తగిన ఆధారాలు కనిపించవు కూడా. కానీ సాటి మనిషి ఎదురైనపుడు - నమస్కరించక పోయినా (హృదయంతో కాదనుకోండి) సూచించినపుడు నైవేద్యం అర్పించి, కాస్త ధూపంపట్టక పోయినా శ్రీవారి ఆగ్రహానుగ్రహాలు మన జీవితాల పైన ఎంత గట్టి ముద్ర వేస్తాయో, మన అనుభవాలకు భిన్నమైనది కాదు కదా...
అంతెందుకు, మా ఆఫీసుకే ఒక ఆఫీసరుండే వాడుట. ఆయన మీసాలు చూస్తేనే చాలు గుమస్తాలకు జ్వరం వచ్చినంత పని అయేదట. ఆమహాను భావుడు తన అనుగ్రహం వల్లనే గుమస్తాలు జీవిస్తున్నట్లు అనుకొని, అలా అని ఊరుకోకుండా బాహాటం గా అందరికీ చెప్పుకొనేవాడుట. ఆయనకు నమస్కారం అందుకోవడ మంటే తీరని సరదా. గ్రహచారం కాలి ఏ గుమస్తా అయినా నమస్కారం మరచాడంటే యిహ వాడి పని ఆఖరు. ఒక ఆదివారం నాడు అమాయకుడైన ఒక గుమస్తా, సతీసమేతంగా మ్యాట్నీసినీమా చిత్తగించి వస్తూ ఎదురుపడ్డ యీ ఆఫీసరును చూచి కూడా మనస్కరించడం మరచిపోయాడు. తీరా ఆయన దాటి పోయిన తరువాత ...అ...రె....రె.... నమస్కరించడం మరచిపోయానే, ఏం కొంప మునుగు తుందో – దైవమా నీదే భారం అని కనుపించని దైవాలకు అందరకూ వందేసి నమస్కారాలర్పించేడుట . అయినా అతని గుండెలని భయం తొలగ లేదు. ఇంతలో ఆ అధికారి దయకు పాత్రుడూ, హితుడూ, లౌకిక ఙ్ఞానంలో వృధ్ధుడూ అయిన ఆసామి ఒకడు వచ్చి “ఎంత పని చేసావయ్యా? ఒక దండం విసిరేస్తే నీ సొమ్మేం దండుగయిందా.. తలతాకట్టు పెట్టుకున్నవాడికి తలబిరుసు తగదుసుమా !.. ఆయన పాములా బుస కొడుతున్ననాడు. నువ్వు అవమానించేవని....ఆయన కోపం, పట్టుదల, అభిమానం నీకు తెలుసుగా, ఏం జరుగుతుందో”..అని మరింత పిరికి మందు పోసాడు. అంతే.
ఆరాత్రే ఆ అమాయకుడికి పుట్టెడు జ్వరం వచ్చింది. జ్వరంలోనే .. “యిప్పుడు కావాలంటే వంద నమస్కారాలు, సాష్టాంగ దండప్రమాణాలు అర్పించుకుంటాను. పొరపాటు జరిగిపోయింది. యింకెప్పుడూ యిట్టి పొరపాటు పునరావృత్తంకానివ్వను. గంపెడు పిల్లలు గలవాడిని- కనికరించండి” అని పలవరిస్తూ, ఆ పలవరింతలలోనే, గుక్కెడు ప్రాణాలు వదిలేశాడుట. వందేసి నమస్కారాలందుకున్న దైవాలందరూకలసి అతనికి అడ్డు పడలేక పోయారు.
యీ జాలిగాధను మా ఆఫీసులో కొత్తగా, అడుగుంచి సీటులో శరీరాన్న అంటించుకోబోయే ప్రతీ కొత్త గుమస్తాకు పాతుకుపోయిన పాత గుమస్తాలు,రాతి బిళ్ళల్లాంటి అద్దాలవెనుక గుడ్డిగా మెరుస్తున్న జాలికళ్ళతో కళ్ళనీరు పెట్టుకుంటూ, తప్పకుండా చెప్పి, అంతటితో ఆగక తల నాలుగు కాలాల పాటు నిలుపు కోదలచినవాడు, ఆఖరకు తన ఇంట్లోనైనా తలెత్తి తిరగరాదని , పెళ్ళాం , పిల్లల్ని, పోషించుకోదలచినవాడు ఒళ్ళు మరచిపోకూడదని, అధికారి ముఖాన ఉమ్మినా, “పన్నీరు” అని భావించి ,కన్నీరు పెట్టకుండా – “కాళ్ళతో కుమ్మలేదు, ఉమ్మితేనేం” అని సంతోషించాలనే – ఉద్యోగధర్మసూత్రాలను సటీకా తాత్పర్యాలతో సహా వివరించి – “ఏడుస్తూ సుఖంగా జీవించు” అని ఆశీర్వదిస్తారు, అందుకనే నాకు మనిషంటే అంత భయం, భక్తి, ఏర్పడ్డాయనుకుంటాను.
నేనే కాదు, నాబోటి వ్యక్తులు అర్పించిన రోజువారీ నమస్కారాల్లో, ఒక్కటికూడా దైవానికి చెందదు.అన్నీ అధికార, అనధికార వ్యక్తులకే అర్పితం అవుతాయి, అవుతున్నాయి కూడా..
అసలు సూక్ష్మంగా పరిసీలిస్తే ఆకార, వికారాల్లోను, కించిత్ వికారం గోచరిస్తుంది., కాని, స్ధూలంగా పరిశీలిస్తే మానవుడికి, దేవుడికి భేధమే కనబడదని అంటున్నారు కొంతమంది, అందుకనేమో యిటీవల ఏదో సినిమాలో “మానవుడే దేముడహో” అని మాటల్లో అంటే నీరసంగా ఉంటుందని , పాటలో బిగించి గొంతుబద్దలయ్యేలా పాడించి తృప్తిపడ్డారు, కొంతమేది మహాత్ములు అంతమందినీ “మానవసేవే – మాధవసేవ” అని అంగలారుస్తు నమ్మమంటుంటే – ఆ అంతమందిలోను మరి కొంతమంది “మాధవసేవే – మానవసేవ” అని కావాలనుంటే అగరొత్తులను సాక్ష్యం అడగమండున్నారు, యీ రెండుసేవలూ సరిహద్దు సమస్యలా చాల వివాదగ్రస్తంగా వున్నాయి. అదేదో తేలనీ, అంతవరకూ , ఓపికున్నంతవరకూ “కాంతా – కనకాలసేవ చేద్దాం”, అంటూ సదరు సేవల్లో మునిగి తేలుతున్నారు., కొంతమంది తెలివైన వాళ్ళు.
యిలా మనం ఆలోచించుకుంటూ పోతే – ఇంతకూ దేముడున్నాడా లేదా అనే పాతప్రశ్నే మన ఎదుటనిలబడుతుంది.
తరతరాలుగా తీరుబడిగా వున్న మహానుభావులంతా , తలలుకొట్టుకున్నా ఎటూతేలక ఉండిపోయిన సమస్య యిది,ఒక్కటే ననిపిస్తుంది,- నామట్టుకు,
యీ పాడుప్రపంచంలో ఎవరి వసరం ఎప్పుడు ఎదురవుతుందో చెప్పలేం- అందుకే ఎందుకైనా అటు దైవాన్ని, యిటు మానవుడిని కూడా మంచిచేసుకోవటం మంచిది. దీనికి మీరు “తటస్థ లౌకిక ధర్మం” అని నామకరణం చేసేనా , నాకు అభ్యంతరమేమీ లేదు, అందుకమే – నేను “కాఫీహోటల్” నేమ్ బోర్డు నడుమ మురళి వాయిస్తున్న మురళీకృష్ణున్ని, ఆయుష్కర్మశాల బోర్డు మధ్య యిబ్బంది పడుతున్న శ్రీరామచంద్రునకు – ఆ దారంట పోతున్నపుడల్లా ఒక నమస్కారం పారేస్తుంటాను.,
“ఆ విసిరే నమస్కారమేదో – దేవాలయానికి పోయి విసరకూడదూ” అని మీ బోటి భక్తులు కోప్పడతారని నాకు తెలుసు. దేముడనే వాడిని – రాతి గదిలో ఖైదు చేసి, పారి పోతాడేమోనని ముందు ఇనుప కటకటాలుంచి, ఆపైన ఓనామాలయ్యవారిని కాపలాకూడా ఉంచి, ఆఖైదీలాంటి దైవాన్ని చూపించడానికి టిక్కెట్టుకూడా బిగించారే – యిలాంటి స్థితిలో అస్మదాదులకు ఆలయప్రవేశం అంత సులభమా.. చెప్పండి ఎలానూ దైవదర్శనానికి పోతూ రిక్తహస్తాలతో పోకూడదనే నియమం ఒకటి అఘోరిస్తోంది కదా,.. కనీసం పావలా కదళీఫలాలు ఒక కొబ్బరికాయ కొనకతప్పదు కదా. తీరా ఒక పూట పస్తుండైనా యీ సరంజామా అంతా తీసుకుని పోయి నా మాట తీర్చి దిద్దిన ఆచార్యులవారికి అర్పించుకోవలసిందే కానీ, మనం అర్పించిన అరటిపండు నోరు విప్పి తినకపోతే పోయె, - కన్నెత్తైనా చూడడు కదా, ఆ దైవం. యీ మాత్రం భాగ్యానికి ముప్పావల డబ్బులు దండుగెందుకు ముప్పావలా అంటే మాటలా – నాలుగు రోజులు కూరఖర్చు ఒడ్డెక్కుతుంది.
అందుకనే వుంటే ఎక్కడున్నా దేముడు – దేముడే కనుక , నైవేద్యం బెడద, పైసా ఖర్చు, రద్దీ లేకుండా తీరుబడిగా దర్శనమిచ్చే – కాఫ్కాలయం – ఆయుష్కర్మశాల యిత్యాది బోర్డులపై వెలసిన దైవస్వరూపాలకే నమస్కరిస్తుంటాను.
ఏమైనా నాకు మనిషంటే – దైవం కన్నా భయం,భక్తి, ఒక అరతులం అధికం అని బల్లగుద్ది మైకు లేకపోయినా అందరకూ వినబడేట్లు కేకేసి చెప్పగలను, యీ విషయంలో మాత్రం అబద్ధంఆడినా కలిసొచ్చేది యేమీలేదు, కనుక అబద్ధం ఆడి అనృతదోషం కట్టుకోవలసిన అవసరం లేదు నాకు.
మీరూ – మానవులే కదా.. యిలా అనడం ధర్మమా.. , సబబా, అని ఎవరైనా అనడానికి కొంత ఆస్కారం వుంది, సవినయంగా , దానికి కూడా కారణం మనవి చేసికుంటున్నాను.
నేనూ మనిషినేనని ఎప్పుడూ అనుకోలేదు, కానీ పోయిన ఎన్నికల సంబరంలో ఓటర్ల జాబితాలో నా పేరు నమోదయి వుందని తెలిసిన తరువాత నేనూ మనిషినేనన్న దురభిప్రాయం నాలో లీలగా కలిగింది.ఆ సమయంలో నే కొందరు మాన్యులు కొద్ది సెకెండ్లు పాటు నన్ను మానవుడిగా గుర్తుపట్టడం జరిగింది. అటు తర్వాతగానీ , అంతకు పూర్వం కానీ నేనూ మానవుడినేనని భ్రాంతిపడే అవకాశం కలగలేదు.
పోనీ – నా భార్య కూడా నన్నెప్పుడు మానవుడిగా చూడలేదు, అది మీరే నా దైవం అంటుంది, మనం – మన కనీస అవసరాలు తీర్చేవరాలు యీయకపోయినా యేదో విధంగా అతన్నే దైవమనీ నమ్ముతున్నాం కదా,.. అలానే సంవత్సరానికి ఒక చీర కూడా కొని ఈయకపోయినా ఆమె ఆ మాట మాత్రం మానదు.
తెలుగు సినిమాలు అందులోనూ – యిటీవలవి చూసీ అలా అనడం , నటించటం నేర్చుకుందేమోనని మీరు భ్రాంతి పడనక్కరలేదు.
ఆమెనెప్పుడూ నా వెంట సినిమాకు రమ్మని నేను ప్రార్ధించనూ లేదు – ఆమె ఎప్పుడూ తన్ను తీసుకుపొమ్మని నన్ను అర్ధించనూ లేదు. ఆ పాఠం ఏ దుర్ముహూర్తానో, వాళ్ళ అమ్మ, అమ్మమ్మల వద్ద జాయింటుగా నేర్చుకుందట, ఆ పాఠాన్ని పోనీయకుండా మా పెద్దదానికి నేర్పుతోంది, దానికి మొగుడనేవాడు దొరికేసరికీ మరి రెండు పంచవర్ష ప్రమాళికలుదాటి పోవచ్చు. అప్పటికి యీ పాఠం దాని ఒంటపడుతుందని మా ఆవిడ అభిప్రాయంకూడా..
మన వారి ఉపన్యాసంలా , ప్రస్తుతవిషయాన్ని వదలి చాలా దూరం వచ్చేశాం, - యిక యీ ఉపాఖ్యానాల గొడవ కట్టిపెట్టి అసలు నా గొడుగు గొడవకు వద్దాం.
నాకు ప్రాణప్రదమైన గొడుగు – నా మనసు ఆక్రమించి నన్ను నడిపించే గొడుగు – ఇరవై సంవత్యరాల నా జీవితంలో ముడివేసుకున్న నా గొడుగు – ఉన్నట్టుండి అకస్మాత్తుగా మాయమైంది. నా గుండెల్లో బండ పడింది. అకస్మాత్తుగా భౌతిక జగతి నా ముందు నశించిపోయి నట్లయింది.
మా శ్రీమతి – స్వతంత్రించి తాకట్టు పెట్టేసిందేమోనని, కోపంతో నాకు వచ్చిన దుర్భాషలన్నీ వరుసక్రమం లేకుండా....ప్రయోగించాను. అది – పాపం నెత్తి బాదుకుంటూ- తనకే పాపం తెలియదని – నా మీద ఒట్టేసిందాయె. యింకేం చేసేది-
పోలీసుకు రిపోర్టుయిస్తే సరి, ..అన్నాడు... ఎవరో అపరిచితుడు- యీ గొడువ ఒక పరిచయస్తునితో చెప్పుకుంటుంటే ప్రక్కనుంచి,
నా గొడుగు నాకు తిరిగి చేరకపోయినా, వారిని వదిలించుకునేసరికీ తాతలు దిగివస్తారు.
అందుచేత నేనే స్వయాన పరిశోధించదలచుకున్నాను, అందుకు ప్రాతిపదిగా దిట్టమైన అపరాధపరిశోధన నవలలు చదివేను. కోట్లకొలది గుట్టలలో నున్నా – నా బుట్టమార్కు గుబ్బగొడుగును యిట్టే గుర్తుపట్టగలను. అదృష్టమే నన్ను వరిస్తుందో ,దురదృష్టమే నన్ను పరిహసిస్తుందో, నేను చెప్పలేను కాని దొరుకుతుందనే ఆరని ఆశతోనే అన్వేషణ సాగిస్తున్నాను. మీరు కూడా యీ నా ప్రయత్నంలో శ్రమ నుకోకుండా సహకరించాలి.నా గొడుగును మీరు గుర్తుపట్టడానికి వివరాలు కూడా దిస్తున్నాను.
హేండిల్ విరిగుంటుంది,
రెండు కమానులు విరిగి – వంగి వున్నాయి.
డజనుకుపైగా మాసికలు – లెక్కపెట్టలేనన్ని చిల్లులు వుంటాయి. యీ వివరాలు గల నా గొడుగు ఆచూకీ తెలిస్తే మాత్రం నాకు తెలియచేయవలసినదిగా అర్ధిస్తున్నాను.- బహుమానంగా మీకు మీరు కోరినన్ని నమస్కారాలు (పైసా ఖర్చులేనివి కనుక) అర్పించుకుంటానని హామీయిస్తూ ప్రార్ధిస్తున్నాను. మీ పనుల తొందరలో నా మనవి – మరచిపోవద్దని మనవి చేసుకుంటున్నాను.
మరచిపోకండి - మరచిపోరు కదూ......
అసలు మానవుని గొప్పతనం, తోటి మానవునిచేత గొడుగు పట్టించుకోవడంలోనే గర్భితమై వుందని పూర్వీకుల గట్టి నమ్మకం. ఆ నమ్మకాన్ని గట్టిగా నమ్మే కాబోలు – శ్రీకృష్ణుడంతటివాడు కర్ణునితో “చూస్తావేమయ్యా .... వాయుపుత్రుడి చేత నీకు దివ్యశ్ఛత్రాన్ని పట్టిస్తాను” అని ఆశ చూపించి, “యీ దెబ్బతో కర్ణుడు పాండవులతో చేతులు కలపక తప్పదు” అనుకున్నాడు. అయినా కర్ణుడు గొడుగు పట్టించుకునే వ్యామోహానికి తల ఒగ్గలేదు. కాబట్టి అతనికింత వరకు పేరు ప్రఖ్యాతి దక్కాయి. యీ ఒక్క విషయం చాలు మన పూర్వీకులు గొడుగు పట్టించుకునేందుకు ఎంత ముచ్చటపడేవారో తెలవడానికి.
కాలం అనేక మార్పులు పొందినా , ఆనాటినుంచి , యీనాటివరకూగొడుగు పట్టించుకునే ఉబలాటం , గొప్పవారమనుకునే వారికి వీసమెత్తుకూడా తగ్గలేదు. కాలాన్ని జయించి , నిలబడ్డ కీర్తి ఖాయంగా దీనికే దక్కాలి. మరీ, నేను మొత్తం జనాన్ని, “గొడుగు పట్టించుకునేవారు.. గొడుగు పట్టేవారు” అని రెండు భాగాలు గా విభజించాను.
అయితే కాలగర్భం లో పడి తెల్లగొడుగుల కాలం, చల్లగా తరలి పోయింది. యీనాడు మనకు మిగిలిన వన్నీ నల్లగొడుగులే. యీ లోకంలో కోటానుకోట్ల గుబ్బగొడుగులుండొచ్చును. కాని నాకు వాటితో ప్రసక్తి లేదు. యీ నా గొడవంతా నా ఒక్క గొడుగుకే పరిమితమై ఉంది. అయితే “గొడుగు గురించి యింత గొడవ దేనికి?“ అని అడగొచ్చు. కానీ, నాకూ, నా గొడుగుకు గల అనుబంధం మీరు తెలుసు కుంటే, మీరు తప్పక మీ ప్రశ్నను ఉపసంహరించుకుంటారు.
నా వివాహంలో లాంఛన ప్రాయంగా జరిగిన కాశీ యాత్రా తంతులో మా బావ మరిది ఒక నల్లగొడుగు, జత చెప్పులు నాకు సమర్పించి సముదాయించాడు. తరువాత నా ఉద్యోగాన్వేషణా, భీషణ ప్రయత్నంలో చెప్పులు అరిగి నామరూపరహితమైనా, గొడుగు మాత్రం కొద్ది చిల్లులతోనైనా యీనాటివరకూ నా చేతిలో మిగిలి పోయింది. నా జీవితాన్ని ఆక్రమించుకుంది.
ఆదిలో నా అర్ధాంగిలానే, నా గొడుగూ నా మాట వినిపించుకునేది కాదు. బాహాటంగా ఎదురు తిరిగే శక్తి లేక, యితరుల కాళ్ళలో బడి...వాళ్ళచేత తిట్టించేది. అటు తరువాత అచిరకాలంలోనే, “యిద్దరం కలసి చిరకాలం జీవించడం తప్పనిసరి”. అని తెలుసుకున్న తరువాత .. నా భార్యలాగే... మనసు సరి చేసుకుని నాతో సహకరించడం ప్రారంభించింది లెండి.
వివాహం అనేది ప్రతి జీవి, జీవితంలోనూ, ఒక మధురశృతి...మధురస్మృతి- అట్టి మధురక్షణాలు జీవితఘర్షణలో పడి చెరిగిపోకుండా గుర్తుకు చేడానికంటూ కొన్ని ఙ్ఞాపకాలుండాలి. అలా మా వివాహానికి గుర్తుగా మిగిలినవి ...దాని మెళ్ళో నల్లపూసలు, మంగళ సూత్రం, నా చేతిలో నల్లని గొడుగూ, అందుకనే నాకు ఆ గొడుగంటే అంత మమత ఏర్పడుంటుంది.
ప్రస్తుతం నేను నా గొడుగును, ఎండ, వాన, మొదలైన అల్పవిషయాలకు ఉపయోగించనేలేదు. అది ఉపయోగించదు కూడా. నా గుండెల్లో మండే మంట కన్న కారే కన్నీటికి మిన్నగా నన్ను వర్షం తడిపెయ్యగలదా?.. లేదే...అందుకే నాకు ఎండకూ, వానకూ ఎన్నడూ గొడుగవసరంలేదు. అయితే ఎండకూ వానకూ ఉపయోగించని గొడుగు దేనికి?. అని మీకు అర్ధం కాని ప్రశ్న నా ముఖంమీద మీరు విసురుతారని నాకు తెలుసు. అందుకే మనవి చేసుకుంటున్నాను.
నా అదృష్టం వల్ల ...వారి దురదృష్టం వల్ల నాకు అప్పిచ్చితీరుగ వసూలు చేసుకుందామని. నన్ను పట్టుకుందికి, ఓపిగ్గా తిరుగుతున్న అప్పులవాళ్ళ తీక్షణ, వీక్షణ పంక్తుల నుండీ – ఆదివారం నాడైనా, ఆఫీసు పని అయిన తర్వాత నైనా, రోడ్డుమీద తారస పడితే, నిప్పులు గక్కే అధికార్ల నుంచీ నా తలను తప్పించి, తన గర్భంలో దాచేసుకుని నన్ను కంటికి రెప్పలా కాపాడుతుంది నాగొడుగు. – అంత కన్నా మహోపయోగం – ఏముందీ.
నాకు మనుష్యుల ఎదుట పడడటమంటే తగని భయం. అంతే కాదు – దైవంకన్నా సగటు మనిషంటేనే - భయం, భక్తి కూడా నాకు మిన్న, ఎందుకంటారేమో..
ఒక్కసారైనా దైవానికి నైవేద్యం సమర్పించక పోయినా, నమస్కరించక పోయినా, ఆగ్రహిస్తాడో లేదో ఎవరూ చెప్పలేరు. ఆగ్రహిస్తాడనడానికి తగిన ఆధారాలు కనిపించవు కూడా. కానీ సాటి మనిషి ఎదురైనపుడు - నమస్కరించక పోయినా (హృదయంతో కాదనుకోండి) సూచించినపుడు నైవేద్యం అర్పించి, కాస్త ధూపంపట్టక పోయినా శ్రీవారి ఆగ్రహానుగ్రహాలు మన జీవితాల పైన ఎంత గట్టి ముద్ర వేస్తాయో, మన అనుభవాలకు భిన్నమైనది కాదు కదా...
అంతెందుకు, మా ఆఫీసుకే ఒక ఆఫీసరుండే వాడుట. ఆయన మీసాలు చూస్తేనే చాలు గుమస్తాలకు జ్వరం వచ్చినంత పని అయేదట. ఆమహాను భావుడు తన అనుగ్రహం వల్లనే గుమస్తాలు జీవిస్తున్నట్లు అనుకొని, అలా అని ఊరుకోకుండా బాహాటం గా అందరికీ చెప్పుకొనేవాడుట. ఆయనకు నమస్కారం అందుకోవడ మంటే తీరని సరదా. గ్రహచారం కాలి ఏ గుమస్తా అయినా నమస్కారం మరచాడంటే యిహ వాడి పని ఆఖరు. ఒక ఆదివారం నాడు అమాయకుడైన ఒక గుమస్తా, సతీసమేతంగా మ్యాట్నీసినీమా చిత్తగించి వస్తూ ఎదురుపడ్డ యీ ఆఫీసరును చూచి కూడా మనస్కరించడం మరచిపోయాడు. తీరా ఆయన దాటి పోయిన తరువాత ...అ...రె....రె.... నమస్కరించడం మరచిపోయానే, ఏం కొంప మునుగు తుందో – దైవమా నీదే భారం అని కనుపించని దైవాలకు అందరకూ వందేసి నమస్కారాలర్పించేడుట . అయినా అతని గుండెలని భయం తొలగ లేదు. ఇంతలో ఆ అధికారి దయకు పాత్రుడూ, హితుడూ, లౌకిక ఙ్ఞానంలో వృధ్ధుడూ అయిన ఆసామి ఒకడు వచ్చి “ఎంత పని చేసావయ్యా? ఒక దండం విసిరేస్తే నీ సొమ్మేం దండుగయిందా.. తలతాకట్టు పెట్టుకున్నవాడికి తలబిరుసు తగదుసుమా !.. ఆయన పాములా బుస కొడుతున్ననాడు. నువ్వు అవమానించేవని....ఆయన కోపం, పట్టుదల, అభిమానం నీకు తెలుసుగా, ఏం జరుగుతుందో”..అని మరింత పిరికి మందు పోసాడు. అంతే.
ఆరాత్రే ఆ అమాయకుడికి పుట్టెడు జ్వరం వచ్చింది. జ్వరంలోనే .. “యిప్పుడు కావాలంటే వంద నమస్కారాలు, సాష్టాంగ దండప్రమాణాలు అర్పించుకుంటాను. పొరపాటు జరిగిపోయింది. యింకెప్పుడూ యిట్టి పొరపాటు పునరావృత్తంకానివ్వను. గంపెడు పిల్లలు గలవాడిని- కనికరించండి” అని పలవరిస్తూ, ఆ పలవరింతలలోనే, గుక్కెడు ప్రాణాలు వదిలేశాడుట. వందేసి నమస్కారాలందుకున్న దైవాలందరూకలసి అతనికి అడ్డు పడలేక పోయారు.
యీ జాలిగాధను మా ఆఫీసులో కొత్తగా, అడుగుంచి సీటులో శరీరాన్న అంటించుకోబోయే ప్రతీ కొత్త గుమస్తాకు పాతుకుపోయిన పాత గుమస్తాలు,రాతి బిళ్ళల్లాంటి అద్దాలవెనుక గుడ్డిగా మెరుస్తున్న జాలికళ్ళతో కళ్ళనీరు పెట్టుకుంటూ, తప్పకుండా చెప్పి, అంతటితో ఆగక తల నాలుగు కాలాల పాటు నిలుపు కోదలచినవాడు, ఆఖరకు తన ఇంట్లోనైనా తలెత్తి తిరగరాదని , పెళ్ళాం , పిల్లల్ని, పోషించుకోదలచినవాడు ఒళ్ళు మరచిపోకూడదని, అధికారి ముఖాన ఉమ్మినా, “పన్నీరు” అని భావించి ,కన్నీరు పెట్టకుండా – “కాళ్ళతో కుమ్మలేదు, ఉమ్మితేనేం” అని సంతోషించాలనే – ఉద్యోగధర్మసూత్రాలను సటీకా తాత్పర్యాలతో సహా వివరించి – “ఏడుస్తూ సుఖంగా జీవించు” అని ఆశీర్వదిస్తారు, అందుకనే నాకు మనిషంటే అంత భయం, భక్తి, ఏర్పడ్డాయనుకుంటాను.
నేనే కాదు, నాబోటి వ్యక్తులు అర్పించిన రోజువారీ నమస్కారాల్లో, ఒక్కటికూడా దైవానికి చెందదు.అన్నీ అధికార, అనధికార వ్యక్తులకే అర్పితం అవుతాయి, అవుతున్నాయి కూడా..
అసలు సూక్ష్మంగా పరిసీలిస్తే ఆకార, వికారాల్లోను, కించిత్ వికారం గోచరిస్తుంది., కాని, స్ధూలంగా పరిశీలిస్తే మానవుడికి, దేవుడికి భేధమే కనబడదని అంటున్నారు కొంతమంది, అందుకనేమో యిటీవల ఏదో సినిమాలో “మానవుడే దేముడహో” అని మాటల్లో అంటే నీరసంగా ఉంటుందని , పాటలో బిగించి గొంతుబద్దలయ్యేలా పాడించి తృప్తిపడ్డారు, కొంతమేది మహాత్ములు అంతమందినీ “మానవసేవే – మాధవసేవ” అని అంగలారుస్తు నమ్మమంటుంటే – ఆ అంతమందిలోను మరి కొంతమంది “మాధవసేవే – మానవసేవ” అని కావాలనుంటే అగరొత్తులను సాక్ష్యం అడగమండున్నారు, యీ రెండుసేవలూ సరిహద్దు సమస్యలా చాల వివాదగ్రస్తంగా వున్నాయి. అదేదో తేలనీ, అంతవరకూ , ఓపికున్నంతవరకూ “కాంతా – కనకాలసేవ చేద్దాం”, అంటూ సదరు సేవల్లో మునిగి తేలుతున్నారు., కొంతమంది తెలివైన వాళ్ళు.
యిలా మనం ఆలోచించుకుంటూ పోతే – ఇంతకూ దేముడున్నాడా లేదా అనే పాతప్రశ్నే మన ఎదుటనిలబడుతుంది.
తరతరాలుగా తీరుబడిగా వున్న మహానుభావులంతా , తలలుకొట్టుకున్నా ఎటూతేలక ఉండిపోయిన సమస్య యిది,ఒక్కటే ననిపిస్తుంది,- నామట్టుకు,
యీ పాడుప్రపంచంలో ఎవరి వసరం ఎప్పుడు ఎదురవుతుందో చెప్పలేం- అందుకే ఎందుకైనా అటు దైవాన్ని, యిటు మానవుడిని కూడా మంచిచేసుకోవటం మంచిది. దీనికి మీరు “తటస్థ లౌకిక ధర్మం” అని నామకరణం చేసేనా , నాకు అభ్యంతరమేమీ లేదు, అందుకమే – నేను “కాఫీహోటల్” నేమ్ బోర్డు నడుమ మురళి వాయిస్తున్న మురళీకృష్ణున్ని, ఆయుష్కర్మశాల బోర్డు మధ్య యిబ్బంది పడుతున్న శ్రీరామచంద్రునకు – ఆ దారంట పోతున్నపుడల్లా ఒక నమస్కారం పారేస్తుంటాను.,
“ఆ విసిరే నమస్కారమేదో – దేవాలయానికి పోయి విసరకూడదూ” అని మీ బోటి భక్తులు కోప్పడతారని నాకు తెలుసు. దేముడనే వాడిని – రాతి గదిలో ఖైదు చేసి, పారి పోతాడేమోనని ముందు ఇనుప కటకటాలుంచి, ఆపైన ఓనామాలయ్యవారిని కాపలాకూడా ఉంచి, ఆఖైదీలాంటి దైవాన్ని చూపించడానికి టిక్కెట్టుకూడా బిగించారే – యిలాంటి స్థితిలో అస్మదాదులకు ఆలయప్రవేశం అంత సులభమా.. చెప్పండి ఎలానూ దైవదర్శనానికి పోతూ రిక్తహస్తాలతో పోకూడదనే నియమం ఒకటి అఘోరిస్తోంది కదా,.. కనీసం పావలా కదళీఫలాలు ఒక కొబ్బరికాయ కొనకతప్పదు కదా. తీరా ఒక పూట పస్తుండైనా యీ సరంజామా అంతా తీసుకుని పోయి నా మాట తీర్చి దిద్దిన ఆచార్యులవారికి అర్పించుకోవలసిందే కానీ, మనం అర్పించిన అరటిపండు నోరు విప్పి తినకపోతే పోయె, - కన్నెత్తైనా చూడడు కదా, ఆ దైవం. యీ మాత్రం భాగ్యానికి ముప్పావల డబ్బులు దండుగెందుకు ముప్పావలా అంటే మాటలా – నాలుగు రోజులు కూరఖర్చు ఒడ్డెక్కుతుంది.
అందుకనే వుంటే ఎక్కడున్నా దేముడు – దేముడే కనుక , నైవేద్యం బెడద, పైసా ఖర్చు, రద్దీ లేకుండా తీరుబడిగా దర్శనమిచ్చే – కాఫ్కాలయం – ఆయుష్కర్మశాల యిత్యాది బోర్డులపై వెలసిన దైవస్వరూపాలకే నమస్కరిస్తుంటాను.
ఏమైనా నాకు మనిషంటే – దైవం కన్నా భయం,భక్తి, ఒక అరతులం అధికం అని బల్లగుద్ది మైకు లేకపోయినా అందరకూ వినబడేట్లు కేకేసి చెప్పగలను, యీ విషయంలో మాత్రం అబద్ధంఆడినా కలిసొచ్చేది యేమీలేదు, కనుక అబద్ధం ఆడి అనృతదోషం కట్టుకోవలసిన అవసరం లేదు నాకు.
మీరూ – మానవులే కదా.. యిలా అనడం ధర్మమా.. , సబబా, అని ఎవరైనా అనడానికి కొంత ఆస్కారం వుంది, సవినయంగా , దానికి కూడా కారణం మనవి చేసికుంటున్నాను.
నేనూ మనిషినేనని ఎప్పుడూ అనుకోలేదు, కానీ పోయిన ఎన్నికల సంబరంలో ఓటర్ల జాబితాలో నా పేరు నమోదయి వుందని తెలిసిన తరువాత నేనూ మనిషినేనన్న దురభిప్రాయం నాలో లీలగా కలిగింది.ఆ సమయంలో నే కొందరు మాన్యులు కొద్ది సెకెండ్లు పాటు నన్ను మానవుడిగా గుర్తుపట్టడం జరిగింది. అటు తర్వాతగానీ , అంతకు పూర్వం కానీ నేనూ మానవుడినేనని భ్రాంతిపడే అవకాశం కలగలేదు.
పోనీ – నా భార్య కూడా నన్నెప్పుడు మానవుడిగా చూడలేదు, అది మీరే నా దైవం అంటుంది, మనం – మన కనీస అవసరాలు తీర్చేవరాలు యీయకపోయినా యేదో విధంగా అతన్నే దైవమనీ నమ్ముతున్నాం కదా,.. అలానే సంవత్సరానికి ఒక చీర కూడా కొని ఈయకపోయినా ఆమె ఆ మాట మాత్రం మానదు.
తెలుగు సినిమాలు అందులోనూ – యిటీవలవి చూసీ అలా అనడం , నటించటం నేర్చుకుందేమోనని మీరు భ్రాంతి పడనక్కరలేదు.
ఆమెనెప్పుడూ నా వెంట సినిమాకు రమ్మని నేను ప్రార్ధించనూ లేదు – ఆమె ఎప్పుడూ తన్ను తీసుకుపొమ్మని నన్ను అర్ధించనూ లేదు. ఆ పాఠం ఏ దుర్ముహూర్తానో, వాళ్ళ అమ్మ, అమ్మమ్మల వద్ద జాయింటుగా నేర్చుకుందట, ఆ పాఠాన్ని పోనీయకుండా మా పెద్దదానికి నేర్పుతోంది, దానికి మొగుడనేవాడు దొరికేసరికీ మరి రెండు పంచవర్ష ప్రమాళికలుదాటి పోవచ్చు. అప్పటికి యీ పాఠం దాని ఒంటపడుతుందని మా ఆవిడ అభిప్రాయంకూడా..
మన వారి ఉపన్యాసంలా , ప్రస్తుతవిషయాన్ని వదలి చాలా దూరం వచ్చేశాం, - యిక యీ ఉపాఖ్యానాల గొడవ కట్టిపెట్టి అసలు నా గొడుగు గొడవకు వద్దాం.
నాకు ప్రాణప్రదమైన గొడుగు – నా మనసు ఆక్రమించి నన్ను నడిపించే గొడుగు – ఇరవై సంవత్యరాల నా జీవితంలో ముడివేసుకున్న నా గొడుగు – ఉన్నట్టుండి అకస్మాత్తుగా మాయమైంది. నా గుండెల్లో బండ పడింది. అకస్మాత్తుగా భౌతిక జగతి నా ముందు నశించిపోయి నట్లయింది.
మా శ్రీమతి – స్వతంత్రించి తాకట్టు పెట్టేసిందేమోనని, కోపంతో నాకు వచ్చిన దుర్భాషలన్నీ వరుసక్రమం లేకుండా....ప్రయోగించాను. అది – పాపం నెత్తి బాదుకుంటూ- తనకే పాపం తెలియదని – నా మీద ఒట్టేసిందాయె. యింకేం చేసేది-
పోలీసుకు రిపోర్టుయిస్తే సరి, ..అన్నాడు... ఎవరో అపరిచితుడు- యీ గొడువ ఒక పరిచయస్తునితో చెప్పుకుంటుంటే ప్రక్కనుంచి,
నా గొడుగు నాకు తిరిగి చేరకపోయినా, వారిని వదిలించుకునేసరికీ తాతలు దిగివస్తారు.
అందుచేత నేనే స్వయాన పరిశోధించదలచుకున్నాను, అందుకు ప్రాతిపదిగా దిట్టమైన అపరాధపరిశోధన నవలలు చదివేను. కోట్లకొలది గుట్టలలో నున్నా – నా బుట్టమార్కు గుబ్బగొడుగును యిట్టే గుర్తుపట్టగలను. అదృష్టమే నన్ను వరిస్తుందో ,దురదృష్టమే నన్ను పరిహసిస్తుందో, నేను చెప్పలేను కాని దొరుకుతుందనే ఆరని ఆశతోనే అన్వేషణ సాగిస్తున్నాను. మీరు కూడా యీ నా ప్రయత్నంలో శ్రమ నుకోకుండా సహకరించాలి.నా గొడుగును మీరు గుర్తుపట్టడానికి వివరాలు కూడా దిస్తున్నాను.
హేండిల్ విరిగుంటుంది,
రెండు కమానులు విరిగి – వంగి వున్నాయి.
డజనుకుపైగా మాసికలు – లెక్కపెట్టలేనన్ని చిల్లులు వుంటాయి. యీ వివరాలు గల నా గొడుగు ఆచూకీ తెలిస్తే మాత్రం నాకు తెలియచేయవలసినదిగా అర్ధిస్తున్నాను.- బహుమానంగా మీకు మీరు కోరినన్ని నమస్కారాలు (పైసా ఖర్చులేనివి కనుక) అర్పించుకుంటానని హామీయిస్తూ ప్రార్ధిస్తున్నాను. మీ పనుల తొందరలో నా మనవి – మరచిపోవద్దని మనవి చేసుకుంటున్నాను.
మరచిపోకండి - మరచిపోరు కదూ......