కృష్ణా పత్రిక 09-12-1961 లో ప్రచురితం
కొంపలంటుకున్నాయి..యింకా
అంటుకుంటూనే ఉన్నాయి. అంటుకున్న
కొంపల్లోంచీ, కుట్ర పన్నిన మంటలు, నాలుకలు చాచుకుని బయటపడి, అంబరానికి కంటుకు
పోతున్నాయి. నిర్భాగ్యుల ఆక్రందనలు,
మండుతూ, విరుగుతూన్న కఱ్ఱల,భీకరరవం తో కలసి కూలిపోతున్నాయి. రోదసి దద్దరిల్లుతూంది...ధరణి
ఊగిసలాడుతూంది.. పచ్చి
బాలింతరాలు,తొలిచూలు పసికందుని గుండెల్లో దాచేసుకొంటూంది. కాటికి కాళ్ళు దాటిన
వృధ్ధుడు,చివరిసారిగా,శక్తిని కూడదీసుకుని లేవడానికి ప్రయత్నిస్తున్నాడు. పాకలో పశువులు,కట్లు
తెంచుకుని,బెదురుతూ,గురి తప్పిన బాణాల్లా పరుగులు తీస్తున్నాయి. క్షణ
క్షణానికి,రేగుతున్న, పెనుమంటలముందు,ఏమీచేయలేని, అమాయకుల రోదన---నిస్సహాయ
ఆవేదన,గుండేలు ద్రవించే మూగబాధ. చుట్టూమూగేరు---అసంఖ్యాక
ప్రజానీకం,...........చూస్తున్నారు................చూస్తారేం ?.......... ఒక్కరూ ముందుకురకరు
?... ఏం .............................. భయమా ?..... ఆపదలో భయానికి తావెక్కడ?
సహాయానికి,సందేహం దేనికి
?... అభాగ్యులనూ, ఆర్తులనూ, ఆదుకోవలసిన
సమయంలో....అలా...ముడుచుకు పోయినిలబడతారేం ?.... ఇవన్ని అర్ధంలేని
ప్రశ్నలు.....చచ్చు ప్రశ్నలు... వారికి అవసరం లేదు... కాలుతున్నవి వారి కొంపలు
కావు.....అంతే .....అదే దాని అంతరార్ధం. ఆ అనంత జనంలో, శతాంశం
ముందుకురికితే, మంటలు ఏనాడో ఆరేవి., మాటలతో మంటలెలా ఆరుతాయి.. వారంతా
----------నాగరీకులు. గాబర్డీను ప్యాంటు, అమెరికన్ షర్టులతో కుళ్ళిపోతున్న
గుండెల్ని కప్పుకుని----మానవాకృతిని నిలిచిన మృగాలు,సృగాలాలు. మంటలంబరాన్ని,
అంటుతున్నాయో లేదో నని అంచనా కట్టుకుంటున్నారు.అగ్గి ఉద్భవించడానికి కారణాలు,
శోధిస్తున్నారు. మంటలు ఒక ఇంటి
మీదనుంచీ,మరొక ఇంటి మీదకు అడుగులు వేస్తూ పైశాచిక నృత్యం చేస్తూ కడుపు
కట్టుకుని,ఆర్జించిన, నికృష్ట కష్టజీవుల,నిక్షిప్త వస్తు సంచయాన్ని కడుపున
పెట్టుకుని----త్రేన్చుకుంటున్నాయి.
ఈ ప్రళయ నృత్యం చూసిన కొందరి హృదయాలు కథాకళి నృత్యంచేసాయి.ఎందుకో?
విధి వెలిగించుకుంటున్న
దీపావళిని వింతగా, చోద్యంగా, చూస్తున్న ఆర్ద్రతలేని హృదయాలకు,అభాగ్య జీవుల ముఖాలను
పట్టుకుంటున్న శోకాంధ తిమిరావళి........ఎలా కనిపిస్తుంది. ఆకష్టజీవుల కళ్ళనుంచి
కారుతున్నది---కన్నీరు కాదు---రుధిరస్రవంతులు,అయినా.....అవి రేగుతున్న మంటలను
ఆర్పలేకపోయాయి. కారి,కారి,కన్నీళ్లు
ఆఖరయి---యిక కారడం మానుకున్నాయి, చారికలు మాత్రం, పొగచూరిన ముఖాలమీద,ఎండిన మహానదుల్లా,స్పష్టం
గా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.
అగ్నికి ఆకలి తీరింది. ఎవరి ప్రయత్నము అక్కరలేకుండానే, తగ్గిపోయింది. గృహస్తుల కండ్ల వెలుగూ
ఆరింది కాని ఆ అభాగ్యుల హృదిలోని మంటలు, నాలుకలు కీడుతూ, తడుముతూనే ఉన్నాయి. దుష్టశక్తులు వేసుకున్న
చలిమంటలో, తమ చలిని కూడా పొగొట్టుకున్న
జనం.........సంతాపం ఒలికించి,నటించి
జారుకున్నారు ఒక్క రొక్కరే కాలిన తమ యిండ్లను చూసుకుని గుక్కపట్టి
ఏడ్చిన, దురదృష్టవంతులు—అలా ఏడ్చి, సొమ్మసిల్లి, పోయారు. మృత్యువులాంటి చీఁకటి
తలుపు తెరుచుకుని , లోకాన్ని
ఆక్రమించింది. హృదయాలు పగిలే నీరవనిశ్శబ్ద నిశీధినిలో ----నిరాశ్రయులు
బూదిప్రోగులైన తమ చిరాశ్రయాలను వీడి-----చెట్లను ఆశ్రయించారు. చెట్లు విలవిలలాడి,
ఆకులు కదలటం మాని, మూగగా వారిసంతాపంలో పాలుపంచుకుని,చెమర్చాయి. ఆ తప్త హృదయాలకు---ఆరాత్రి
ఒక దు:ఖతపస్సు·
* *ఈ విషాధ సంఘటన రెండు బృందాలకు మహత్తరమైన
అవకాశం కల్పించింది. ప్రధమ బృందం-----మనసుకు రంగేసుకుని, అనుక్షణం నటించే, “ప్రజాబాంధవ” వినాయకరావు—ముఠా.ద్వితీయబృందం మనసుకూ ముఖానికి, రంగేసుకునే ఔత్సాహిక నాటక
సమాజం. సదరు బృందాల అధినేతలు, యీ అమూల్యావకాశాన్ని సద్విని యోగపరచుకునేందుకు,సమగ్ర
పధకాలు,తృటిలో రూపొందింపచేశారు. ఏమైనా
----ఈ వేడి మీదే –ప్రదర్శన ఇచ్చి తీరాలి. నా నిర్ణయానికి సవరణ ప్రతిపాదించకు, నీ
పుణ్యముంటుంది. పోర్షన్సు --ఇంతకు ముందు కొంచెం – నలిగినవేకదా—మరేం –ఫర్వాలేదు. నువ్వు
మాత్రం శల్యసారధ్యం చేయకు—నీ నీతులు,ధర్మాలూ కట్టి,బెట్టి, కట్ట కట్టి, తలకింద
ఉంచుకో. నాటకం తప్పకుండా విజయవంతం
అవుతుంది. అదంతా----ఆ తరువాత సంగతి.---నాటకం ప్రదర్శించామా లేదా అన్నదే మనకు
ముఖ్యం. నువ్వూ—నేనూ,
నాటకం వేస్తే టిక్కట్టు కొని వచ్చేవాడెవడు. అందుకే
మన బోటి ఔత్సాహిక నాటక ప్రదర్శనాలకు –ఏ
కరువులో ఉత్సవాలో, స్వతంత్ర దినోత్సవాలో, బ్యాక్ గ్రౌండులో ఏడవాలి.---బలంగా..-అప్పుడు కంపల్సరీ
బుకింగుచేయొచ్చు. కానీ ఖర్చు చేతికి తగలదు- మన కండూతీ దివ్యంగా తీరుతుంది.రాక రాక మహత్తరమైన
అవకాశం మనల్ని వరించి వచ్చింది. అవకాశం
అడుగడుగునా అప్పులవాళ్ళలా ఎదురవదు. అరుదుగా ఋణదాతలాగా తొంగి చూస్తుంది. ఆ అదను,
పదనూ పోకుండా,వినియోగించుకోవడంలోనే ఉంది –మన ఉపజ్ఞ – అంతా.స్వార్ధం అంటావ్
--- అంతేనా నీ బుఱ్ఱలో మట్టి చేరిందని
అర్ధం. యీ లోకంలో, కాలం లో స్వార్ధం
లేనివాడెవడూ..ముఖానికి
రంగేసుకోనివారే నటిస్తున్నారే......మనం నటించడం లో తప్పేముంది. చూడు...ఆ వినాయకరావు ...మనలా ముడుచుకు పోయి కూర్చోలేదే..బృందాన్ని
చేరదీసి, కాఫీలు పోయించి, బాజాలు మోగించేస్తున్నాడు. వాడిని మనం ఆదర్శంగా
తీసుకోవాలి బాగు పడాలంటే. యిలా ధర్మోపదేశం, గీతోపదేశం చేశాడు. కర్తవ్యమూఢుడై అర్జునిలా ఎదురు తిరిగిన సమాజంలో
ఒక ప్రధాన సభ్యుడికి----సమాజ దర్శకుడు, నిర్వాహకుడు.
ఏమైనాసరే
----పోర్షనైనా నోటికి రానిదే, రంగేసుకుని, రంగస్థలాన పడితే...... మనం
ప్రదర్శించింది నాటకమనిపించుకోదు.---- మన అవివేకం,స్వార్ధం ప్రదర్శించి
నట్టవుతుంది. అని సలహాయిచ్చాడు ఆసభ్యుడు –కర్కశంగా.
. . .
ఆరిన బీడీఅంటించు
కుందికినానిన అగ్గిపెట్టెతో తంటాలు పడుతున్న - - -ప్రాంప్టరు
చేయి వేస్తేచాలు
---తన జీవితంలానే అపశ్రుతులు పలికే హార్మణీవైపు తదేకంగా చూస్తోన్న . .
.----హర్మోనిష్టు.మదిని తెరచి, ఒళ్ళు
విరుచుకున్న తీయని ఆశల్ని ఆకశంలోకి వదిలేసి, అవి అక్కడ ఆర్కెష్ట్రా మినహా, హాయిగా “సోలో” పాడుకుంటుంటే -----కళ్ళు మూసుకుని
చూస్తూ, మత్తుగా నవ్వుకుంటున్న ---హీరో,ఏకాంతంగా,
నిలుచున్న ఎదురింటి అమ్మాయికి --- కిటికీలోంచీ, ప్రేమ సందేశాన్ని, సాంకేతికంగా
ప్రసారం చేస్తున్న ---సపోర్టింగ్ హీరో-----అంతా ఒక్కసారి
ఉలికిపడి, తరువాత కుదుటపడి, దర్శకుని అమూల్యాభిప్రాయాలకు మద్దతు యిచ్చి,
దుర్మార్గంగా ఎదురిస్తున్న ఏకైక ---సభ్యత నెరుగని, సభ్యుని నోరుమూసి పీకనులమడానికి
ప్రయత్నించారు.---యిక విధిలేక పాపం ఆ ఒక్కడూ, అమాయకుడూ, తన ఒప్పు, తప్పేనని
ఒప్పేసుకుని---చెంపలేసుకున్నాడు చప్పుడు కాకుండా....వినాయకరావు,
భారీఎత్తున సంతాప సభ జరిపించి రెండు మైకుల మధ్య కడివెడు కళ్ళ నీళ్ళు ఒంపేసి
-----జరిగి పోయిన దారుణ విషాధ సంఘటనకు నా గుండె కరిగిపోయింది.అని నటించి---అగ్ని
బాధితుల సహాయార్ధం, సహృదయులైన ప్రజలు, విరివిగా విరాళాలు యీయవలసినదిగా విజ్ఞప్తి
చేసాడు.ఇకపోతే—ఔత్సాహీక
నాటక బృందం –అతనికి తీసికట్టు కాకుండా, పోటీపడకుండా కనుపించిన ప్రతీ వ్యక్తి
చేతిలోనూ అగ్ని బాధితుల సహాయార్ధం మహోజ్వలనాటక ప్రదర్శన ---“అంతా యింతే”--- అన్న కరపత్రం ఉంచేరు---చిరునవ్వుతోగత గోదారి వరద
బాధితుల సహాయార్ధం తయారు చేయించిన డబ్బాలు చాలవని ---కొత్తవి
పురమాయించి----పాతవాటికి మూతలు అతికించి ---ఎదురు తిరగబోయే, ప్రతి కక్షులమూతులు
కూడా బిగించేశాడు. వినాయకరావు.ఔత్సాహిక నాటక
బృందం---ఉరకలు వేసే ఉత్సాహంతో, కనుపించిన ప్రతి వాడికీ టిక్కట్టు అంటకట్టి –నాటకం
చాల బాగుంటుందని తమకు తామే చెప్పేసుకుని, తప్పక రావలసిందని గట్టిగా నొక్కి
చెప్పేరు, ఈ సందర్భంలో రిహార్సలు మాటే మరచి పోయారు.·
* *“అంతా యింతే”--- నాటక ప్రదర్శనవేయవధి లేని కారణంగా చేత—యింకా అనేక కారణాంతరాలచేత అనుకున్నంత గొప్పగా ప్రదర్శించ
లేకపోయినందుకు మన్నింప ప్రార్ధన అని నాటకాంతాన్ని ముచ్చటించి, ప్రేక్షకులచేత
తిట్లనుంచి బయటపడడానికి ప్రయత్నంచి విఫలమయ్యారు...ప్రదర్శకులు. ఆ మరునాడు---నాటకం జమా
ఖర్చులు నిద్రలేని కళ్ళతోనే లెక్క వేయడం జరిగింది. కలక్షను –250 రూపాయల చిల్లర,
సదరు లెక్క ప్రకారం పదిరూపాయల పైచిల్లర – మిగులు తేలిందని ---తేలింది. కానీ యదార్ధం గా చిల్లర తప్ప పది రూపాయల బాలెన్సు చేతిలో కనిపించలేదు. ఎక్కడో
తథావతు వచ్చి ఉంటుందని – సర్దేసుకుని, కళ్ళు పడి పోతున్నాయని చిల్లర డబ్బుల తోలు చప్పరిచారు. నాటక సమాజం నిర్వాహకులు --- సభ్యులు. అనంతరం మనం చేయ గనిగిన
దంతా చేశాం, వారి ఖర్మకు మనం కర్త లం కాదు గదా
అని పెదవి చప్పరించారు. అవును..అగ్ని బాధితుల
పేరుతో సహృదయులైన ప్రజలనుంచి ధనాన్ని వసూలు చేసి, మన సరదాలకోసం, స్వార్ధం కోసం,
తగలేసి—మనం చెయగలిగినదంతా చేశాం – యింకేం చేయాలి.
ఒక్కపైసా కూడా ఆ అభ్యాగ్యుల కందలేదు...పాపం వారు మనమేదో ఒరగ బెడతామని ఆశతో
ఎదురుచూస్తున్నారు---ఛీ . . . మన కన్నా చీడపురుగులు మరొకరుండ బోరు అని దురుసుగా అనేసి విసురుగా లేచి పోయాడు ---ఆది నుంచీ నాటకం ప్రతిపాదనకు ఎదురు
తిరుగుతున్న – సహృదయ సమాజ సభ్యుడు. వినాయకరావు చేతి మీదుగా
వసూలయి న చందాల మొత్తం లో, ఎన్నో వంతు అగ్ని బాధితులకు అందచేయ బడిందో ఎవరకూ
తెలియదు.------ కానీ ఓ చిన్న మేడ అర్ధాంగి పేర రిజిష్టరుచేయించాడు వినాయకరావు అన్న
నీలి వార్త చెదరుగా వినిపించింది. ఈ వార్తను వినాయక రావు,
అభిమానులు, అనుయాయులు ఖండిచనూ లేదు,ధృవపరచనూ లేదు.·
* *యింకా కాలి పొగచూరిన గోడలు, వాడలూ, పగిలిన
గుండెలతో పగలబడి సమాజాన్ని చూస్తూ పరిహాసంగా నవ్వుకుంటున్నాయి.యీ నవ్వులు ---
మూసుకొని స్వార్ధపు ప్రహారీలను దాటి, మాసి పోతున్న సమాజ హృదయానికి
వినిపిస్తున్నాయా. ఎందుకో నేడు
సానుభూతిలో కూడా ఇంత స్వార్ధం తొంగి చూస్తూంది...సమాజానికి అవసాన కాలం
సమీపిస్తున్నది కాబోలు-----అంతే....అంతే అయి ఉంటుంది...... సహాయానికి,సందేహం దేనికి
?... అభాగ్యులనూ, ఆర్తులనూ, ఆదుకోవలసిన
సమయంలో....అలా...ముడుచుకు పోయినిలబడతారేం ?.... ఇవన్ని అర్ధంలేని
ప్రశ్నలు.....చచ్చు ప్రశ్నలు... వారికి అవసరం లేదు... కాలుతున్నవి వారి కొంపలు
కావు.....అంతే .....అదే దాని అంతరార్ధం. ఆ అనంత జనంలో, శతాంశం
ముందుకురికితే, మంటలు ఏనాడో ఆరేవి., మాటలతో మంటలెలా ఆరుతాయి.. వారంతా
----------నాగరీకులు. గాబర్డీను ప్యాంటు, అమెరికన్ షర్టులతో కుళ్ళిపోతున్న
గుండెల్ని కప్పుకుని----మానవాకృతిని నిలిచిన మృగాలు,సృగాలాలు. మంటలంబరాన్ని,
అంటుతున్నాయో లేదో నని అంచనా కట్టుకుంటున్నారు.అగ్గి ఉద్భవించడానికి కారణాలు,
శోధిస్తున్నారు. మంటలు ఒక ఇంటి
మీదనుంచీ,మరొక ఇంటి మీదకు అడుగులు వేస్తూ పైశాచిక నృత్యం చేస్తూ కడుపు
కట్టుకుని,ఆర్జించిన, నికృష్ట కష్టజీవుల,నిక్షిప్త వస్తు సంచయాన్ని కడుపున
పెట్టుకుని----త్రేన్చుకుంటున్నాయి.
ఈ ప్రళయ నృత్యం చూసిన కొందరి హృదయాలు కథాకళి నృత్యంచేసాయి.ఎందుకో? విధి వెలిగించుకుంటున్న
దీపావళిని వింతగా, చోద్యంగా, చూస్తున్న ఆర్ద్రతలేని హృదయాలకు,అభాగ్య జీవుల ముఖాలను
పట్టుకుంటున్న శోకాంధ తిమిరావళి........ఎలా కనిపిస్తుంది. ఆకష్టజీవుల కళ్ళనుంచి
కారుతున్నది---కన్నీరు కాదు---రుధిరస్రవంతులు,అయినా.....అవి రేగుతున్న మంటలను
ఆర్పలేకపోయాయి. కారి,కారి,కన్నీళ్లు
ఆఖరయి---యిక కారడం మానుకున్నాయి, చారికలు మాత్రం, పొగచూరిన ముఖాలమీద,ఎండిన మహానదుల్లా,స్పష్టం
గా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.
అగ్నికి ఆకలి తీరింది. ఎవరి ప్రయత్నము అక్కరలేకుండానే, తగ్గిపోయింది. గృహస్తుల కండ్ల వెలుగూ
ఆరింది కాని ఆ అభాగ్యుల హృదిలోని మంటలు, నాలుకలు కీడుతూ, తడుముతూనే ఉన్నాయి. దుష్టశక్తులు వేసుకున్న
చలిమంటలో, తమ చలిని కూడా పొగొట్టుకున్న
జనం.........సంతాపం ఒలికించి,నటించి
జారుకున్నారు ఒక్క రొక్కరే కాలిన తమ యిండ్లను చూసుకుని గుక్కపట్టి
ఏడ్చిన, దురదృష్టవంతులు—అలా ఏడ్చి, సొమ్మసిల్లి, పోయారు. మృత్యువులాంటి చీఁకటి
తలుపు తెరుచుకుని , లోకాన్ని
ఆక్రమించింది. హృదయాలు పగిలే నీరవనిశ్శబ్ద నిశీధినిలో ----నిరాశ్రయులు
బూదిప్రోగులైన తమ చిరాశ్రయాలను వీడి-----చెట్లను ఆశ్రయించారు. చెట్లు విలవిలలాడి,
ఆకులు కదలటం మాని, మూగగా వారిసంతాపంలో పాలుపంచుకుని,చెమర్చాయి. ఆ తప్త హృదయాలకు---ఆరాత్రి
ఒక దు:ఖతపస్సు·
* *ఈ విషాధ సంఘటన రెండు బృందాలకు మహత్తరమైన
అవకాశం కల్పించింది. ప్రధమ బృందం-----మనసుకు రంగేసుకుని, అనుక్షణం నటించే, “ప్రజాబాంధవ” వినాయకరావు—ముఠా.ద్వితీయబృందం మనసుకూ ముఖానికి, రంగేసుకునే ఔత్సాహిక నాటక
సమాజం. సదరు బృందాల అధినేతలు, యీ అమూల్యావకాశాన్ని సద్విని యోగపరచుకునేందుకు,సమగ్ర
పధకాలు,తృటిలో రూపొందింపచేశారు. ఏమైనా
----ఈ వేడి మీదే –ప్రదర్శన ఇచ్చి తీరాలి. నా నిర్ణయానికి సవరణ ప్రతిపాదించకు, నీ
పుణ్యముంటుంది. పోర్షన్సు --ఇంతకు ముందు కొంచెం – నలిగినవేకదా—మరేం –ఫర్వాలేదు. నువ్వు
మాత్రం శల్యసారధ్యం చేయకు—నీ నీతులు,ధర్మాలూ కట్టి,బెట్టి, కట్ట కట్టి, తలకింద
ఉంచుకో. నాటకం తప్పకుండా విజయవంతం
అవుతుంది. అదంతా----ఆ తరువాత సంగతి.---నాటకం ప్రదర్శించామా లేదా అన్నదే మనకు
ముఖ్యం. నువ్వూ—నేనూ,
నాటకం వేస్తే టిక్కట్టు కొని వచ్చేవాడెవడు. అందుకే
మన బోటి ఔత్సాహిక నాటక ప్రదర్శనాలకు –ఏ
కరువులో ఉత్సవాలో, స్వతంత్ర దినోత్సవాలో, బ్యాక్ గ్రౌండులో ఏడవాలి.---బలంగా..-అప్పుడు కంపల్సరీ
బుకింగుచేయొచ్చు. కానీ ఖర్చు చేతికి తగలదు- మన కండూతీ దివ్యంగా తీరుతుంది.రాక రాక మహత్తరమైన
అవకాశం మనల్ని వరించి వచ్చింది. అవకాశం
అడుగడుగునా అప్పులవాళ్ళలా ఎదురవదు. అరుదుగా ఋణదాతలాగా తొంగి చూస్తుంది. ఆ అదను,
పదనూ పోకుండా,వినియోగించుకోవడంలోనే ఉంది –మన ఉపజ్ఞ – అంతా.స్వార్ధం అంటావ్
--- అంతేనా నీ బుఱ్ఱలో మట్టి చేరిందని
అర్ధం. యీ లోకంలో, కాలం లో స్వార్ధం
లేనివాడెవడూ..ముఖానికి
రంగేసుకోనివారే నటిస్తున్నారే......మనం నటించడం లో తప్పేముంది. చూడు...ఆ వినాయకరావు ...మనలా ముడుచుకు పోయి కూర్చోలేదే..బృందాన్ని
చేరదీసి, కాఫీలు పోయించి, బాజాలు మోగించేస్తున్నాడు. వాడిని మనం ఆదర్శంగా
తీసుకోవాలి బాగు పడాలంటే. యిలా ధర్మోపదేశం, గీతోపదేశం చేశాడు. కర్తవ్యమూఢుడై అర్జునిలా ఎదురు తిరిగిన సమాజంలో
ఒక ప్రధాన సభ్యుడికి----సమాజ దర్శకుడు, నిర్వాహకుడు.
ఏమైనాసరే
----పోర్షనైనా నోటికి రానిదే, రంగేసుకుని, రంగస్థలాన పడితే...... మనం
ప్రదర్శించింది నాటకమనిపించుకోదు.---- మన అవివేకం,స్వార్ధం ప్రదర్శించి
నట్టవుతుంది. అని సలహాయిచ్చాడు ఆసభ్యుడు –కర్కశంగా.
. . .ఆరిన బీడీఅంటించు
కుందికినానిన అగ్గిపెట్టెతో తంటాలు పడుతున్న - - -ప్రాంప్టరుచేయి వేస్తేచాలు
---తన జీవితంలానే అపశ్రుతులు పలికే హార్మణీవైపు తదేకంగా చూస్తోన్న . .
.----హర్మోనిష్టు.మదిని తెరచి, ఒళ్ళు
విరుచుకున్న తీయని ఆశల్ని ఆకశంలోకి వదిలేసి, అవి అక్కడ ఆర్కెష్ట్రా మినహా, హాయిగా “సోలో” పాడుకుంటుంటే -----కళ్ళు మూసుకుని
చూస్తూ, మత్తుగా నవ్వుకుంటున్న ---హీరో,ఏకాంతంగా,
నిలుచున్న ఎదురింటి అమ్మాయికి --- కిటికీలోంచీ, ప్రేమ సందేశాన్ని, సాంకేతికంగా
ప్రసారం చేస్తున్న ---సపోర్టింగ్ హీరో-----అంతా ఒక్కసారి
ఉలికిపడి, తరువాత కుదుటపడి, దర్శకుని అమూల్యాభిప్రాయాలకు మద్దతు యిచ్చి,
దుర్మార్గంగా ఎదురిస్తున్న ఏకైక ---సభ్యత నెరుగని, సభ్యుని నోరుమూసి పీకనులమడానికి
ప్రయత్నించారు.---యిక విధిలేక పాపం ఆ ఒక్కడూ, అమాయకుడూ, తన ఒప్పు, తప్పేనని
ఒప్పేసుకుని---చెంపలేసుకున్నాడు చప్పుడు కాకుండా....వినాయకరావు,
భారీఎత్తున సంతాప సభ జరిపించి రెండు మైకుల మధ్య కడివెడు కళ్ళ నీళ్ళు ఒంపేసి
-----జరిగి పోయిన దారుణ విషాధ సంఘటనకు నా గుండె కరిగిపోయింది.అని నటించి---అగ్ని
బాధితుల సహాయార్ధం, సహృదయులైన ప్రజలు, విరివిగా విరాళాలు యీయవలసినదిగా విజ్ఞప్తి
చేసాడు.ఇకపోతే—ఔత్సాహీక
నాటక బృందం –అతనికి తీసికట్టు కాకుండా, పోటీపడకుండా కనుపించిన ప్రతీ వ్యక్తి
చేతిలోనూ అగ్ని బాధితుల సహాయార్ధం మహోజ్వలనాటక ప్రదర్శన ---“అంతా యింతే”--- అన్న కరపత్రం ఉంచేరు---చిరునవ్వుతోగత గోదారి వరద
బాధితుల సహాయార్ధం తయారు చేయించిన డబ్బాలు చాలవని ---కొత్తవి
పురమాయించి----పాతవాటికి మూతలు అతికించి ---ఎదురు తిరగబోయే, ప్రతి కక్షులమూతులు
కూడా బిగించేశాడు. వినాయకరావు.ఔత్సాహిక నాటక
బృందం---ఉరకలు వేసే ఉత్సాహంతో, కనుపించిన ప్రతి వాడికీ టిక్కట్టు అంటకట్టి –నాటకం
చాల బాగుంటుందని తమకు తామే చెప్పేసుకుని, తప్పక రావలసిందని గట్టిగా నొక్కి
చెప్పేరు, ఈ సందర్భంలో రిహార్సలు మాటే మరచి పోయారు.·
* *“అంతా యింతే”--- నాటక ప్రదర్శనవేయవధి లేని కారణంగా చేత—యింకా అనేక కారణాంతరాలచేత అనుకున్నంత గొప్పగా ప్రదర్శించ
లేకపోయినందుకు మన్నింప ప్రార్ధన అని నాటకాంతాన్ని ముచ్చటించి, ప్రేక్షకులచేత
తిట్లనుంచి బయటపడడానికి ప్రయత్నంచి విఫలమయ్యారు...ప్రదర్శకులు. ఆ మరునాడు---నాటకం జమా
ఖర్చులు నిద్రలేని కళ్ళతోనే లెక్క వేయడం జరిగింది. కలక్షను –250 రూపాయల చిల్లర,
సదరు లెక్క ప్రకారం పదిరూపాయల పైచిల్లర – మిగులు తేలిందని ---తేలింది. కానీ యదార్ధం గా చిల్లర తప్ప పది రూపాయల బాలెన్సు చేతిలో కనిపించలేదు. ఎక్కడో
తథావతు వచ్చి ఉంటుందని – సర్దేసుకుని, కళ్ళు పడి పోతున్నాయని చిల్లర డబ్బుల తోలు చప్పరిచారు. నాటక సమాజం నిర్వాహకులు --- సభ్యులు. అనంతరం మనం చేయ గనిగిన
దంతా చేశాం, వారి ఖర్మకు మనం కర్త లం కాదు గదా
అని పెదవి చప్పరించారు. అవును..అగ్ని బాధితుల
పేరుతో సహృదయులైన ప్రజలనుంచి ధనాన్ని వసూలు చేసి, మన సరదాలకోసం, స్వార్ధం కోసం,
తగలేసి—మనం చెయగలిగినదంతా చేశాం – యింకేం చేయాలి.
ఒక్కపైసా కూడా ఆ అభ్యాగ్యుల కందలేదు...పాపం వారు మనమేదో ఒరగ బెడతామని ఆశతో
ఎదురుచూస్తున్నారు---ఛీ . . . మన కన్నా చీడపురుగులు మరొకరుండ బోరు అని దురుసుగా అనేసి విసురుగా లేచి పోయాడు ---ఆది నుంచీ నాటకం ప్రతిపాదనకు ఎదురు
తిరుగుతున్న – సహృదయ సమాజ సభ్యుడు. వినాయకరావు చేతి మీదుగా
వసూలయి న చందాల మొత్తం లో, ఎన్నో వంతు అగ్ని బాధితులకు అందచేయ బడిందో ఎవరకూ
తెలియదు.------ కానీ ఓ చిన్న మేడ అర్ధాంగి పేర రిజిష్టరుచేయించాడు వినాయకరావు అన్న
నీలి వార్త చెదరుగా వినిపించింది. ఈ వార్తను వినాయక రావు,
అభిమానులు, అనుయాయులు ఖండిచనూ లేదు,ధృవపరచనూ లేదు.·
* *యింకా కాలి పొగచూరిన గోడలు, వాడలూ, పగిలిన
గుండెలతో పగలబడి సమాజాన్ని చూస్తూ పరిహాసంగా నవ్వుకుంటున్నాయి.యీ నవ్వులు ---
మూసుకొని స్వార్ధపు ప్రహారీలను దాటి, మాసి పోతున్న సమాజ హృదయానికి
వినిపిస్తున్నాయా. ఎందుకో నేడు
సానుభూతిలో కూడా ఇంత స్వార్ధం తొంగి చూస్తూంది...సమాజానికి అవసాన కాలం
సమీపిస్తున్నది కాబోలు-----అంతే....అంతే అయి ఉంటుంది......
No comments:
Post a Comment